cinema
Gallery
National
శిల్పారామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుండి సందర్శకులు శిల్పారామంకు భారీగా తరలివచ్చారు. శిల్పారామంలోని అంపి థియేటర్లో నిర్వహించిన కళాకారులు నృత్యాలు ఆహుతులను మైమరిపించాయి. శ్రీ గీతికా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గురువర్యులు లక్ష్మి కృష్ణ శిష్య బృందం మహా గణపతిమ్, శ్రీ విజ్ఞ రాజాం భజే, శివ శంభో, తిల్లాన, శివ స్తుతి, నటరాజ తాండవం, నృత్యాంజలి తిల్లాన, ఆంగికం మహా దేవా శంకర, […]
ఐటీ కారిడార్లో రోడ్ల విస్తరణకు ముమ్మర కసరత్తు
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీలక మార్గాల్లో నెలకొన్న బాటిల్నెక్లను తొలగించి, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు శనివారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, జలమండలి అధికారి అశోక్ రెడ్డి , శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్కడే హేమంత్ సహదేవరావు , ట్రాఫిక్-1 డీసీపీ జె. రంజన్ రతన్ కుమార్తో […]
ఐటీ కారిడార్లో పట్టపగలే భారీ దోపిడీ.. 57 లక్షలతో జంపైన డ్రైవర్
ఏటిఎంలో క్యాష్ నింపే వాహనంతో పరారైన డ్రైవర్.. కొద్దిదూరంలో వాహనాన్ని వదిలేసి 57 లక్షలతో జంప్ ఐటీ కారిడార్లో పట్టపగలు ఓ భారీ దోపిడీ జరిగింది. ఏటిఎం సెంటర్లలో క్యాష్ నింపేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ డబ్బులు ఉన్న వాహనంతో పాటు పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు కస్టోడియన్లు ఏటిఎంలో డబ్బులు పెడుతుండటం, సెక్యూరిటీ గార్డు మూత్ర విసర్జన కోసమని బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా వాహనంతో పాటు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. […]
హైటెక్సిటీలో రూ. 2200 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా
రూ. 2200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో అక్రమణలు తొలగింపు.. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్ను గురువారం నిర్వహించింది. వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది. మొండి కుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. […]
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ వినయ్
హైకోర్టు నోటీసులు ఇచ్చేందుకు లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ వినయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మరో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. ఓ కేసులో నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి మొదటి విడుతలో రూ.50వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ ఐటీ ఉద్యోగి
అఫీస్ నుండి ఐటీ ఉద్యోగి ఇంటికి కారులో వెళ్తుండగా ఇంజిన్ నుండి పొగలు వచ్చి క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించారు. వెంటనే అప్రమత్తమైన ఐటీ ఉద్యోగి కారు నుండి బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మాదాపూర్ సీసీఆర్టీ వద్ద జరిగింది. ఇజ్జత్నగర్లో నివాసం ఉండే బి. రాఘవకృష్ణ మంగళవారం సాయంత్రం తన షిఫ్ట్ డిజైర్కారు(టీఎస్08ఎఫ్కె3459)లో గచ్చిబౌలిలోని అఫీస్ నుండి ఇజ్జత్నగర్లోని ఇంటికి బయలుదేరాడు. కారు మాదాపూర్ సీసీఆర్టీ వద్దకు చేరుకోగానే ఇంజిన్ […]
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడిండ్రు..
హెచ్సీయూలో ఇంటి దొంగలు.. కిటికి గ్రిల్స్ తొలగించి 50 ల్యాప్ట్యాప్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు ప్రవేశం లేనటువంటి పటిష్ట బందోబస్తు ఉండే హెచ్సీయూలో దొంగతనం జరగడం వర్సిటీలో సంచలనంగా మారింది. వర్సిటీ సీఆర్రావు ఇనిస్టిట్యూట్లో కిటికి గ్రిల్స్ తొలగించి 50 ల్యాప్టాప్లు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హెచ్సీయూలో సీఆర్రావు […]
డ్రోన్లు, ఏఐతో వ్యవసాయం మానిటరింగ్… ఏపీ సీఎం చంద్రబాబు
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలి పది సూత్రాల్లోని అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం పది సూత్రాల్లో భాగంగా ఫార్మర్ అగ్రిటెక్, లాజిస్టిక్స్, విద్యుత్ సంస్కరణలు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. […]
నార్సింగ్ చౌరస్తాలో పార్కును కాపాడిన హైడ్రా
మూడు వేల గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ కబ్జాకు గురైన 60 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. కబ్జాదారుల చెర నుండి పార్కును రక్షించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గండిపేట మండలంలోని నార్సింగ్ విలేజ్ నార్సింగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాయానికి చేరువులో అరుణోదయ కాలనీ హుడా అనుమతి పొందిన లే ఔట్లో 6078 గజాలు పార్కు కోసం కేటాయించారు. ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న […]
ఉన్నత చదువులు చదివేందుకు పేద విద్యార్థికి హెల్ప్ చేసిన లయన్స్ క్లబ్
ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆ విద్యార్థికి అవకాశం వచ్చింది. కానీ అంత దూరం వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ పేద విద్యార్థికి ఆర్థిక చేయూతనందించేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద చేతుల మీదుగా సోమవారం ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. సూరారం కాలనీ 60 గజాలకి చెందిన శ్రీపతి ఉదయ్ కుమార్కు ఆస్ట్రేలియాలో మైక్రో బయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశం వచ్చింది. […]

