Andhra Pradesh
డ్రోన్లు, ఏఐతో వ్యవసాయం మానిటరింగ్… ఏపీ సీఎం చంద్రబాబు
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలి పది సూత్రాల్లోని అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం పది సూత్రాల్లో భాగంగా ఫార్మర్ అగ్రిటెక్, లాజిస్టిక్స్, విద్యుత్ సంస్కరణలు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. […]
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. దొంగలొస్తున్నారు జాగ్రత్త !
విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలి అప్రమత్తంగా ఉండాలన్న సైబరాబాద్ పోలీసులు మరో పది రోజుల్లో సంక్రాంతి పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులను ప్రకటించింది. సిటీ ప్రజలు కూడా పండుగకు ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాల్లో ఊరికి […]
రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు.. ఒకే చెప్పిన ముఖ్యమంత్రి
కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు.. రాష్ర్టంలో మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు వార్తమ్యాన్, ఆంధ్రప్రదేశ్ : నూతనంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అమోదం తెలిపారు. మొదటి నుండి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి […]
చలికాలం వేడినీటి కోసం వాటర్ హీటర్లు వాడుతున్నారా ?
జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు కరెంట్ షాక్తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం వార్త మ్యాన్ – స్పెషల్ స్టోరీస్ చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం. ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్ హీటర్లు, గీజర్లు అందుబాటులోకి […]
ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
పరీక్షలు ఎప్పడి నుండి అంటే..? పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, […]
‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్ చేసిందా..?
ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు.. ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
నవంబర్ 18న ఫిబ్రవరి నెల స్వామి దర్శన కోటా విడుదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరికబురు అందింది. శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ వెల్లడించనుంది. నవంబర్ 18వ తేదిన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ […]
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని […]
నవంబరు 5న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు […]
