యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్​పై కేసు
1 min read

యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్​పై కేసు

 

కొడుకుని హిరో చేస్తానని తండ్రి వద్ద రూ. 4.50 కోట్లు వసూళు

 

సినిమా తీయకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డైరెక్టర్​ అశోక్​బాబు

 

అశోక్​బాబు, భార్య విజయలక్ష్మీపై సైబరాబాద్​ ఈఓడబ్ల్యూలో కేసు

 

మీ కుమారుడిని సినిమా హిరో పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూళు చేశాడో ఒ ప్రముఖ డైరెక్టర్​. డబ్బులు తీసుకొని సినిమా తీయకుండా మోసం చేయడమే కాకుండా తిరిగి డబ్బులు అడిగిన ఆ యువకుడి తండ్రిని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబరాబాద్​ ఈఓడబ్ల్యూ పోలీసులు ఆ సినిమా డైరెక్టర్​ , అతని భార్య కేసు నమోదు చేశారు.

సైబరాబాద్​ ఈఓడబ్ల్యూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్​పల్లి భాగ్యనగర్​కాలనీకి చెందిన నాయుడు హనమంతరావు బిజినేస్​ చేస్తుంటాడు. హనమంతరావుకు నయీం అనే వ్యక్తి ద్వారా పిల్ల జమిందార్​, భాగమతి, ఆకాశరామన్న సినిమాలు డైరెక్ట్​ చేసిన డైరెక్టర్​ అశోక్​బాబు, అతని భార్య విజయలక్ష్మీ పరిచయం అయ్యారు. తాము ఒక సినిమా తీస్తున్నామని, అందులో మీ కుమారుడిని హిరోగా పరిచయం చేస్తామని చెప్పారు. అంతే కాకుండా సిని పరిశ్రమలో మరిన్నీ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

 

సినిమా బడ్జెట్​ రూ. 8 కోట్ల అవుతుందని, ఆరు నెలల్లో లాభాలతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన హనమంతరావు డైరెక్టర్​ అశోక్​బాబుకు 2024 సెప్టెంబర్​ 3వ తేది నుండి 2025 డిసెంబర్​ 2వ తేది వరకు దశల వారిగా రూ. 3.05 కోట్ల డబ్బు ట్రాన్స్​ఫర్​ చేశాడు. ఆ తర్వాత మరో రూ. 45 లక్షల చెక్​ను కూడా ఇచ్చాడు. 2024లో హనమంతరావు కొడుకు హిరోగా డైరెక్టర్​ అశోక్​బాబు సినిమా షూటింగ్​ ప్రారంభించారు. అయితే సినిమా షూటింగ్​ పూర్తి చేయకుండా డబ్బు మొత్తం అశోక్​బాబు తన వద్ద పెట్టుకున్నాడు. సినిమా షూటింగ్​ పూర్తి చేయాలని, లేదంటే డబ్బులు తిరిగి ఇవ్వాలని హనమంతరావు డిమాండ్​ చేయడంతో డైరెక్టర్​ అశోక్​బాబు రూ. 4.50 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చి రూ. 50 లక్షల విలువైన నాలుగు చెక్కులు ఇచ్చాడు.

 

గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకపోవడంతో హనమంతరావు డైరెక్టర్​ అశోక్​బాబును నిలదీయగా.. నీ కుమారుడికి ఫ్యూచర్​ లేకుండా చేస్తాం, డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. సినిమా షూటింగ్​ పూర్తి చేయకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా డైరెక్టర్​ బెదిరింపులకు గురిచేయడంతో హనమంతరావు 2025 మే 8వ తేదిన కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కూకట్​పల్లి పోలీసులు ఈఓడబ్ల్యూకు ట్రాన్స్​ఫర్​ చేశారు. జూన్​ 10వ తేదిన సైబరాబాద్​ ఈఓడబ్ల్యూ పోలీసులు డైరెక్టర్​ అశోక్​బాబు అతని భార్య విజయలక్ష్మీ, మరికొందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం డైరెక్టర్​ అశోక్​బాబు, అతని భార్య విజయలక్ష్మీలను సైబరాబాద్​ పోలీసులు విచారించారు.