అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువకులను కారుతో ఢీకొట్టిన పదహారేండ్ల బాలుడు
1 min read

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువకులను కారుతో ఢీకొట్టిన పదహారేండ్ల బాలుడు

రోడ్డు దాటుతున్న యువకులను ఢీకొట్టిన కారు..

ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..

మైనర్​ కొడుక్కు కారు ఇచ్చిన తండ్రితో పాటు మైనర్​ బాలుడిపై కేసు

 

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదహారేండ్ల బాలుడు తన మరో ఇద్దరు ఫ్రెండ్స్​తో కలిసి కారుతో వేగంగా దూసుకువచ్చి రోడ్డు దాటుతున్న ముగ్గురు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని షేక్​పేట్​ ఫ్లైఓవర్​కింద ఈ నెల 1వ తేదిన అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏలా ఉన్నాయి.

మృతుడు సుదీప్త దాస్​

వెస్ట్​ బెంగాల్​ రాష్ర్టం హుగ్లీ జిల్లాకు చెందిన సుదీప్తదాస్​(26), సౌమెన్​రాయ్​(27), అభిజిత్​ రాయ్​(26), మరో వ్యక్తి సౌరవ్​ సంత్ర(26) నగరానికి వలస వచ్చి రాయదుర్గం పోచమ్మబస్తీలో నివాసం ఉంటూ ఫీనిక్స్​ కంపెనీలో లేబర్​ పని చేస్తున్నారు. ఈ నెల 1వ తేదిన రాత్రి సుదీప్తదాస్​, సౌమెన్​రాయ్​, అభిజిత్​రాయ్​ ముగ్గురు కలిసి తమ ఇయర్​ఫోన్​లను ఎక్చెంజ్​ చేసుకోవడానికి సమీపంలోని ఓ ముబైల్​షాప్​కు వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి 11.50 గంటలకు తమ గదికి వెళ్తుండగా షేక్​పేట్​ ఫ్లైఓవర్​ కింద రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో మెహిదిపట్నం నుండి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు(ఏపి31ఏవై1551) ఓ మైనర్​ బాలుడు(16) అతి వేగంగా నడుపుతూ ముగ్గురిని ఢీకొట్టారు.

ప్రమాదానికి కారణమైన కారు

ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ ముగ్గురిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సుదీప్తదాస్​ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. సౌమెన్​రాయ్​ తలకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో యువకుడు అభిజిత్​రాయ్​ కుడికాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మైనర్​ బాలురు ఉన్నట్లు రాయదుర్గం పోలీసులు గుర్తించారు. తన మైనర్​ కుమారుడిని కారు ఇచ్చి ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి గోల్కొండలోని సమతాకాలనీ 7 టుంబ్స్​ ప్రాంతానికి చెందిన మహమ్మద్​ ఇమాదుద్దీన్​(48)పై మృతుడి రూమ్మెట్​ సౌరవ్ ​సంత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్​ చేశారు. ప్రమాదానికి కారణమైన  మైనర్​ బాలుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కారుపై రాంగ్​ సైడ్​ పార్కింగ్​ వంటి ఆరు ట్రాఫిక్​ చలాన్లు కూడా ఉన్నాయి.