Latest Posts

1 min read

టౌన్​ ప్లానింగ్​పైనే ఎక్కువ ఫిర్యాదులు

  గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లోని మియాపూర్​ సర్కిల్​ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అత్యధికంగా టౌన్​ ప్లానింగ్​ విభాగంపైనే ఫిర్యాదులు వచ్చాయి. సర్కిల్​ డిప్యూటీ కమిషనర్​ శశిరేఖ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 24 ఫిర్యాదులు రాగా అందులో టౌన్​ ప్లానింగ్​ విభాగానికి16, ఇంజనీరింగ్​ విభాగానికి 5, యూబీడీ విభాగానికి ఒకటి, రెవెన్యూ విభాగానికి రెండు ఫిర్యాదులు అందాయి. సర్కిల్​ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండడంతో స్థానికులు పెద్ద ఎత్తున వాటిపై ఫిర్యాదులు […]

1 min read

అట్టహాసంగా ముగిసిన ఒడిశా ఫుడ్ అండ్​ క్రాఫ్ట్​ మేళా..

  మాదాపూర్​ శిల్పారామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా ఆదివారం సందడిగా ముగిసింది. ఈ మేళాలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కళలు, హస్తకళలు, సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ మేళాలో ఒడిశాకు ప్రత్యేకమైన హస్తకళలు, హ్యాండ్లూమ్స్‌తో 30కిపైగా క్రాఫ్ట్ స్టాల్స్ అలాగే సంప్రదాయ ఒడియా వంటకాలను అందించిన 20 ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యపురి డాన్స్ […]

1 min read

ఆదరహో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా

ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా హైదరాబాద్​కి తిరిగి వచ్చేసింది. మాదాపూర్​ శిల్పారామంలో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా ఘనంగా ప్రారంభమైంది.   ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఈ మేళాలో ఒడిశా సాంప్రదాయాలు, కళలు, హస్తకళా ఉత్పత్తులు, వంటకాలు, జానపద నృత్యాలు, శాస్ర్తీయ ప్రదర్శనలతో కనువిందు చేయనున్నాయి. మేళాను శిల్పారామం స్పెషల్​ అఫీసర్​ జి. కిషన్​రావు, ఎన్​ఎండీసీ మాజీ డైరెక్టర్​ డి.కె. మహంతి ముఖ్య అతిధులుగా హాజరై […]

1 min read

అప్పులు తీర్చేందుకు చైన్​స్నాచింగ్​ అవతారం… 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయిండు

  అప్పలు తీర్చేందుకు ఓ యువకుడు చైన్​ స్నాచర్​గా మారాడు. గుడి నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో చైన్​ స్నాచింగ్​కు పాల్పడి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన బీహెచ్​ఈఎల్​ ఓల్డ్​ ఎంఐజీలో చోటుచేసుకుంది. ఓల్డ్​ ఎంఐజీలో నివాసం ఉండే పొట్లపల్లి సత్యవతి(72) గత నెల 31వ తేదిన ఉదయం కిలోమీటర్​ దూరంలో ఉన్న రామాలయం దేవాలయానికి వెళ్లి, అక్కడ భోజనాలు చేసి తిరిగి సమయంలో ఎదురుగా వచ్చిన ఓ […]

1 min read

కళలు, సంప్రదాయ సాంస్కృతిక సందడిగా సాగిన నైమిషం ఎర్త్ ఫెస్టివల్

  ఎర్త్ ని మించిన వెల్త్ లేదని చాటిన ఎర్త్ ఫెస్టివల్   ఆకట్టుకున్న సాంస్కృతిక హస్తకళలు పర్యావరణ హితమే అందరి అభిమతం కావాలని, అదే భవిష్యత్ లో మానవాళి కి మేలు చేస్తుందని భిన్న రంగాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియాలో జె కృష్ణమూర్తి హైదరాబాద్ సెంటర్, టీమ్ రేట్రో ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నైమిషం ఎర్త్ ఫెస్టివల్ 3వ ఎడిషన్ నిర్వహించారు. ఈ పర్యావరణ ఉత్సవంలో […]

1 min read

ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో బంగారం ఎత్తుకెళ్లిన చైన్​స్నాచర్​

  బంగారం ధర పెరగడంతో రెచ్చిపోతున్న చైన్​ స్నాచర్లు శనివారం ఇద్దరు మహిళల మెడలో 13 లక్షల 8 తులాల బంగారం లాక్కెళ్లిన స్నాచర్​   బంగారం ధర అకాశాన్ని తాకుతుండడంతో ఇదే అదునుగా చైన్​ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్​గా స్నాచింగ్​కు పాల్పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గుడిలో అన్నదానానికి వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో నుండి ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఈ సంఘటనతో […]

1 min read

క్రీడలతో మానసిక ఉల్లాసం కల్గుతుంది.. గచ్చిబౌలి కార్పొరేటర్​ గంగాధర్​రెడ్డి

  క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని, శారీరక ధృడత్వం పెరుగుతుందని గచ్చిబౌలి డివిజన్​ కార్పొరేటర్​ గంగాధర్​రెడ్డి అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లి లోని మంజీర డైమండ్ హైట్స్ గేట్ కమ్యూనిటీలో నిర్వహించిన “మంజీర ప్రీమియర్ లీగ్” కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లీగ్ ను ప్రారంభించారు.   ఈ సందర్భంగా గంగాధర్​రెడ్డి మాట్లాడుతూ…క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని […]

1 min read

చైనా మాంజాపై పోలీసుల పంజా

కూకట్‌పల్లి పోలీసుల ప్రజా అవగాహన సమావేశం   ఒక చిన్న దారం అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చైనీస్ మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, బాగ్ అమీర్ ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజా అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పోలీస్ అధికారులు ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడుతూ..పండగల ఆనందం పేరుతో చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోందని, ద్విచక్ర […]

1 min read

హైటెక్​సిటీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి డ్రగ్స్​ దందా

అతనో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. ఉద్యోగం చేస్తుండగా వచ్చే జీతం సరిపోకపోవడమో లేదా సులభంగా డబ్బు సంపాధించాలనే కారణంతోనో డ్రగ్స్​ విక్రయించాలని డిసైడ్​ అయ్యాడు. బెంగుళూరు నుండి డ్రగ్స్​ తీసుకువచ్చి ఐటీ కారిడార్​లో ఐటీ ఉద్యోగులకు అమ్మేందుకు సిద్ధమవుతుండగా పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముత్యాల సాయికిరణ్(28) […]

1 min read

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కి లీగల్​ నోటీసులు.. ఎవరు పంపారంటే ?

  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించారని​ బీఆర్​ఎస్​ ముఖ్య నాయకుడు లీగల్​ నోటీసులు పంపించారు. బండి సంజయ్​తో పాటు నిజామాబాద్​ ఎంపి ధర్మపురి అరవింద్​కు కూడా లీగల్​ నోటీసులు పంపించారు. తనపై,  తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని  మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ పార్టీ ​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ బండి సంజయ్​, ఎంపి అర్వింద్​కు వేరువేరుగా​ లీగల్​ నోటీసులు పంపించారు. […]