మియాపూర్లో పెండ్లైన 40 రోజులకే నవ వధువు సూసైడ్
అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులు..
వేధింపులు భరించలేక ఫ్యాన్కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్న భార్య
వారిద్దరికి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి జరిగిన 40 రోజులకే భర్త అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక ఆ సాఫ్ట్వేర్ నవ వధువు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బీహార్ రాష్ర్టానికి చెందిన ఇషికయాదవ్, మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన నీరజ్బన్సల్ ఇద్దరికి 2020 సంవత్సరంలో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించి 2026 ఫిబ్రవరి నెల 20వ తేదిన వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం భార్యభర్తలు మియాపూర్ మక్త మహబూబ్పేట్లోని ఓఅపార్ట్మెంట్లో నివాసం ఉంటూ హైటెక్సిటీలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.
గతకొద్ది రోజులుగా నీరజ్ బన్సల్ అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్య ఇషిక యాదవ్ను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు భరించలేక ఇషిక మంగళవారం రాత్రి తన నివాసంలోనే హాల్లో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం నీరజ్ నిద్రలేచి చూసేసరికి హాల్లో ఇషిక ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
