ఐరన్ గేటు మీద పడి బాలుడు మృతి…
ఐరన్ గేటుతో ఆడుకుంటుండగా అది మీద పడి బాలుడు మృతి చెందాడు. ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టం కేపార్వర్ గ్రామానికి చెందిన వీరేంద్రశర్మ, జ్ఞాణి దంపతులకు కుమార్తె, కుమారుడు రియాన్స్శర్మ(రెండున్నర సంవత్సరాలు) సంతానం. వీరేంద్రశర్మ కుటుంబాన్ని సొంతూరిలోనే ఉంచి గత ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మియాపూర్ బీకే ఎంక్లేవ్లో నివాసం ఉంటూ స్థానికంగా సాయి బాలాజీ ఫ్యాబ్రికేటెడ్లో పనిచేస్తున్నాడు.
రెండు రోజుల క్రితం వీరేంద్రను చూసేందుకు భార్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్కు వచ్చింది. శనివారం ఉదయం భార్యభర్తలు ఇద్దరు పనిచేస్తుండగా వీరి కుమారుడు రియాన్స్ అక్కడే ఉన్న ఐరన్ గేట్తో ఆడుకుంటుండగా అది మీద పడింది. తీవ్రంగా గాయపడ్డ కుమారుడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
