హైటెక్సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం
ఐటీ కారిడార్లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్టీయూ వెళ్లే రూట్లో సైబర్ గేట్వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్టీయూ […]
నకిలీ ప్రొఫైల్స్.. క్లిక్ చేశారో అంతే సంగతులు
పెరుగుతున్న సోషల్ మీడియా మోసాలు నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తత అవసరం.. మనిషి జీవితంలో ప్రస్తుతం సోషల్ మీడియా ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ఫోన్ వచ్చి చేరడంతో సోషల్ మీడియాకి మనుషులు బానిసలుగా మారుతున్నారు. సోషల్ మీడియా వలన ఎంత మేలు జరుగుతుంతో అంతే నష్టం కూడా జరుగుతుంది. సామాజిక మాధ్యమాల రాకతో వేగవంతమైన సమాచార మార్పిడి, కనెక్టివిటీ, సంబంధాల నిర్వహణకు ఉపయోగపడుతున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్ల కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత, ఆర్థికపరమైన సవాళ్లు విసురుతున్నాయి. […]
హైదరాబాద్లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్ ఫెస్టివల్..
కైట్ ఫెస్టివల్కు సిద్ధమైన హైదరాబాద్ నగరం.. కూకట్పల్లి నల్లచెరువు, మాదాపూర్ తమ్మిడికుంట, పాతబస్తీ బమ్రుక్న్ ఉద్ దౌలా చెరువులు సిద్ధం పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్ఫెస్టివల్ను హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల వద్ద పతంగులను ఎగరవేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కైట్ ఫెస్టివల్ నిర్వహించే చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం […]
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడత బాలికలకే..
మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కొక్క స్కూల్ చొప్పున పూర్తి చేయాలె.. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 23 స్కూల్స్ పూర్తి చేయాలి.. విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వీటి […]
శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఇంచార్జ్ రేసులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్.. కేటీఆర్ను కలిసింది అందుకేనా..
హైదరాబాద్ నగరంలో అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీకి గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేసులో సాయిబాబా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం […]
శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్
తెలంగాణ రాష్ర్టంలో పలువురు ఐపిఎల్లు బదిలీ అయ్యారు. వీరిలో కొందరిని జీహెచ్ఎంసీలో నూతనంగా ఏర్పాటైన జోన్లకు డీసీపీలుగా ప్రభుత్వం కేటాయించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మాదాపూర్ జోన్ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని ప్రభాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీగా చార్జ్ తీసుకున్న ప్రభాకర్కు పలువురు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీపీ ప్రభాకర్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి జోన్లో శాంతిభద్రతల పరిరక్షణకు […]
ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి అమ్ముతుండ్రు.. ఎక్కడంటే
మద్యం ప్రియులకు ఎప్పటికైనా ఫారిన్ లిక్కర్ను ఒక్కసారి అయినా తాగాలని ఉంటుంది. కానీ వాటి ధరను చూసి ఆ మందును తాగేందుకు మొగ్గుచూపరు. కానీ తక్కువ ధరకే ఫారిన్ లిక్కర్ దొరుకుతే మందుబాబులకు పండుగే. ఈ అవకాశాన్ని ఐదుగురు వ్యక్తులు తమ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఖాళీ ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో బాటిళ్లలో చీప్ లిక్కర్ మందు పోసి ఫేక్ ఫారిన్ లిక్కర్ మందు అమ్ముతున్నారు. ఇలా ఫేక్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అమ్ముతున్న […]
మా భూములపై కన్నెస్తే ఖబర్ధార్… ప్రభుత్వంపై మనూ విద్యార్ధులు ఆగ్రహం
వర్సిటీకి కేటాయించిన భూముల్లో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవడంపై ఆందోళన మనూలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు.. గచ్చిబౌలి లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లో 50 ఎకరాలను వెనక్కు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉర్దూ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. ఉర్దూ యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదని, యూనివర్సిటీ భూమిపై […]
శేరిలింగంపల్లి సర్కిల్ ఏసీపీ వెంకటరమణపై చర్యలు తీసుకోండి
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత మిద్దెల మల్లారెడ్డి శేరిలింగపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటరమణపై అవినీతి అరోపణలు వచ్చిన ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు. ఏసీపీ వెంకటరమణ, చైన్మెన్ మోహన్పై చర్యలు తీసుకోవాలని సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అక్రమ […]
ఈత… కావద్దు కన్న వారికి కడుపు కోత..
స్విమ్మింగ్ ఫూల్ ప్రమాదాల్లో మృతి చెందుతున్న చిన్నారులు.. కన్నవారికి కడుపుశోకం.. జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న పోలీసులు.. ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పూల్ పర్యవేక్షణలో లోపించడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. […]
