Andhra Pradesh
cinema
Gallery
National
భయపడకండి.. మీ ఇండ్ల జోలికి రాము.. ఆ కాలనీలకు భరోసానిచ్చిన హైడ్రా
మీరు ఏలాంటి భయాందోళన చెందవద్దు. మీ కాలనీలలోకి హైడ్రా వచ్చి మీరు ఉంటున్న ఇండ్లను కూల్చివేయదు. మీరు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వివాదాస్పద సర్వే నెంబర్ 44లోని పలు కాలనీవాసులకు హైడ్రా భరోసానిచ్చింది. దీంతో ఆయా కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులు హైడ్రా తమ ఇండ్లను కూల్చివేస్తుందేమోనని కంటి మీద కునుకు లేకుండా గడిపిన కాలనీవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైడ్రా తీపికబురు అందించింది. శేరిలింగంపల్లి […]
చందానగర్ పోలీస్ స్టేషన్ను అకస్మిత తనిఖీ చేసిన శేరిలింగంపల్లి డీసీపీ
చందానగర్ పోలీస్ స్టేషన్ను శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ అకస్మిక తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసుల వివరాలను తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. రికార్డులను నిర్వహిస్తున్న తీరుపై డీసీపీ ఇన్స్పెక్టర్, అడ్మిన్ ఎస్ఐపై అగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారి పట్ల గౌరవంగా మాట్లాడుతూ భరోసా కల్పించాలని డీసీపీ సిబ్బందికి […]
హైటెక్సిటీలోని ఆ రూట్లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్ తిప్పలే..
హైటెక్సిటీలో ఐదు రోజుల వాహనదారులు ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగడంతో రిపేర్ చేయడానికి అలస్యం అయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఆ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు ఐదు రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. దీంతో ఐకియా నుండి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్టీయూ వెళ్లే వెహికిల్స్ మరో రూట్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్టీయూ […]
హైటెక్సిటీలో దారుణం.. యువకుడి చేతికి కట్ చేసిన చైనా మాంజా..
చైనా మాంజా ఈ పేరు వింటే బైకర్లు హడలెత్తిపోతున్నారు. బైక్పై వెళ్తుండగా ఎక్కడ చైనా మాంజా తగిలి ప్రాణాపాయం అవుతుందో అని భయాందోళన చెందుతున్నారు. ఇటీవల చైనా మాంజాలు మెడకు తలిగి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా మాంజా ఉపయోగించవద్దు ప్రాణాలు పోతున్నాయి అని ఒక వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్న వ్యాపారులు మారడం లేదు. బ్లాక్ మార్కెట్లో చైనా మాంజా అమ్ముతూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. వినయోగదారులు అదే చైనా మాంజాలతో పతంగులు ఎగరవేసి […]
హైటెక్సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం
ఐటీ కారిడార్లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్టీయూ వెళ్లే రూట్లో సైబర్ గేట్వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్టీయూ […]
నకిలీ ప్రొఫైల్స్.. క్లిక్ చేశారో అంతే సంగతులు
పెరుగుతున్న సోషల్ మీడియా మోసాలు నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తత అవసరం.. మనిషి జీవితంలో ప్రస్తుతం సోషల్ మీడియా ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ఫోన్ వచ్చి చేరడంతో సోషల్ మీడియాకి మనుషులు బానిసలుగా మారుతున్నారు. సోషల్ మీడియా వలన ఎంత మేలు జరుగుతుంతో అంతే నష్టం కూడా జరుగుతుంది. సామాజిక మాధ్యమాల రాకతో వేగవంతమైన సమాచార మార్పిడి, కనెక్టివిటీ, సంబంధాల నిర్వహణకు ఉపయోగపడుతున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్ల కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత, ఆర్థికపరమైన సవాళ్లు విసురుతున్నాయి. […]
హైదరాబాద్లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్ ఫెస్టివల్..
కైట్ ఫెస్టివల్కు సిద్ధమైన హైదరాబాద్ నగరం.. కూకట్పల్లి నల్లచెరువు, మాదాపూర్ తమ్మిడికుంట, పాతబస్తీ బమ్రుక్న్ ఉద్ దౌలా చెరువులు సిద్ధం పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్ఫెస్టివల్ను హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల వద్ద పతంగులను ఎగరవేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కైట్ ఫెస్టివల్ నిర్వహించే చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం […]
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడత బాలికలకే..
మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కొక్క స్కూల్ చొప్పున పూర్తి చేయాలె.. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 23 స్కూల్స్ పూర్తి చేయాలి.. విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వీటి […]
శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఇంచార్జ్ రేసులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్.. కేటీఆర్ను కలిసింది అందుకేనా..
హైదరాబాద్ నగరంలో అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీకి గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేసులో సాయిబాబా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం […]
శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్
తెలంగాణ రాష్ర్టంలో పలువురు ఐపిఎల్లు బదిలీ అయ్యారు. వీరిలో కొందరిని జీహెచ్ఎంసీలో నూతనంగా ఏర్పాటైన జోన్లకు డీసీపీలుగా ప్రభుత్వం కేటాయించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మాదాపూర్ జోన్ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని ప్రభాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీగా చార్జ్ తీసుకున్న ప్రభాకర్కు పలువురు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీపీ ప్రభాకర్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి జోన్లో శాంతిభద్రతల పరిరక్షణకు […]

