శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్​
1 min read

శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్​

 

తెలంగాణ రాష్ర్టంలో పలువురు ఐపిఎల్​లు బదిలీ అయ్యారు. వీరిలో కొందరిని జీహెచ్​ఎంసీలో నూతనంగా ఏర్పాటైన జోన్లకు డీసీపీలుగా ప్రభుత్వం కేటాయించింది. సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​లో మాదాపూర్​ జోన్​ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా చింతమనేని ప్రభాకర్​ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీగా చార్జ్​ తీసుకున్న ప్రభాకర్​కు పలువురు పోలీస్​ అధికారులు స్వాగతం పలికారు.

 

ఈ సందర్భంగా డీసీపీ ప్రభాకర్​ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి జోన్​లో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తానన్నారు. కేసులు త్వరితగతిలో పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా, దోషులకు శిక్ష పడిలే చూస్తామన్నారు. నూతన డీసీపీకి గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​ బాలరాజు, ఇతర ఇన్​స్పెక్టర్​లు, ఎస్​ఐలు స్వాగతం పలికారు.