వయస్సు 28… దొంగతనాలు 54
1 min read

వయస్సు 28… దొంగతనాలు 54

 

మియాపూర్​లో ఘరానా దొంగ అరెస్ట్​..

 

వాచ్​మెన్​ ఇండ్లే టార్గెట్​గా దొంగతనాలు..

 

మూడు కమిషనరేట్ల పరిధిలో 54 కేసులు..

 

శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : ఆ యువకుడి వయస్సు ప్రస్తుతం 28… కానీ అతను చేసిన దొంగతనాలు 54.. తను 15 యేటా నుండే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చిన్న వయస్సులోనే దొంగతనాల బాట పట్టిన ఆ యువకుడు 13 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. ఇంతని ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

 

మియాపూర్​ పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్ట్​ చేశారు.  అతని వద్ద 3 లక్షల విలువైన వెండి, బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్​పల్లి డీసీపీ రితిరాజ్​ ఘరానా దొంగకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 

వాచ్​మెన్​ ఇండ్లే టార్గెట్​..

 

నెల్లూరు జిల్లా కావలి మండలం చమడాల గ్రామానికి చెందిన వల్లేపు వెంకటేష్​(28) సొంతూరిలో ఏడవ తరగతి వరకు చదువుతుకున్నాడు. చదువు మధ్యలోనే అపేసి కూలీ పనులకు వెళ్లేవాడు. నగరానికి వచ్చి మియాపూర్​ ఎఫ్​సిఐకాలనీ సమీపంలో నివాసం ఉంటూ ఇసుక బిజినేస్​ చేసే ఓ వ్యక్తి వద్ద అసిస్టెంట్​గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పనిచేయగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని డిసైడ్​ అయ్యాడు.

 

స్వతహాగా డబ్బున్న ఇండ్లనే గుర్తించి రెక్కీ నిర్వహించి దొంగతనాలు చేస్తారు. కానీ వెంకటేష్​ మరో రూట్​ ఎంచుకున్నాడు. కాలనీలు, అపార్ట్మెంట్​లలో నివాసం ఉండే వాచ్​మెన్​ ఇండ్లను టార్గెట్​ చేసుకున్నాడు. ముందుగా రెక్కీ నిర్వహించి వాచ్​మెన్​ ఇండ్లలో ఎవరూ లేని సమయంలో ఇంట్లోని బంగారు, వెండి అభరణాలను దొంగలిస్తాడు.

 

దొంగలించిన సొత్తు అమ్మేసి జాల్సాలు..

 

వెంకటేష్​ దొంగతనం చేసిన అనంతరం బంగారు, వెండి అభరణాలను తెలిసిన వ్యక్తులకు అమ్మేస్తాడు. వచ్చిన డబ్బులను బెట్టింగ్​లలో పెట్టడం, మిగిలిన డబ్బును జల్సాలకు వినియోగిస్తాడు.2013 నుండి వెంకటేష్​ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మొదటి దొంగతనం 2013లో ఎల్బీనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చేశాడు. 2015 నుండి సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో చేస్తున్నాడు.

 

దొరికిండు ఇలా…

 

ఈ నెల 21వ తేదిన మాతృశ్రీనగర్​లోని అపార్ట్​మెంట్​లో వాచ్​మెన్​గా పనిచేస్తున్న మంజుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి దూరి వెండి అభరణాలు దొంగలించాడు. దీంతో మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదే పద్దతిలో గతంలో కూడా మియాపూర్​లో రెండు దొంగతనాలు నమోదు కావడంతో మియాపూర్​ పోలీసులు నిందితుడి కోసం నిఘా పెట్టారు.

 

శుక్రవారం మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​లోని మయూరినగర్​లో స్కూటీపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడిని మియాపూర్​ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. గత కొద్ది కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు వెంకటేష్​గా పోలీసులు గుర్తించారు.వెంకటేష్​ నుండి నాలుగు గ్రాముల బంగారం,607 గ్రాముల వెండి అభరణాలు, ఒక్క స్కూటీని స్వాధీనం చేసుకొని అరెస్ట్​ చేశారు.

 

వయస్సు 28… కేసులు 54

 

నిందితుడు వయస్సు ప్రస్తుతం 28 సంత్సరాలు. కానీ అతను చేసిన దొంగతనాలు 54.. ఇంకా ఎన్ని చేశాడో తెలియాల్సి ఉంది.  15 సంవత్సరాల వయస్సు నుండే వెంకటేష్​ చోరిల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేష్​ మూడు కమిషనరేట్ల పరిధిలో 54 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అత్యధికంగా 16 కేసులు, కేపిహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 5 కేసులు ఉన్నాయి.

 

మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్​, ఇతర జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామన్నారు. 2023లో వెంకటేష్​ జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. ప్రస్తుతం మియాపూర్​లోని మూడు కేసులు, గచ్చిబౌలిలోని ఒక కేసులో వెంకటేష్​ను అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో కేపిహెచ్​బీ ఏసీపీ రవికిరణ్​రెడ్డి, మియాపూర్​ ఇన్​స్పెక్టర్​ శివ ప్రసాద్​, డీఐ రమేష్​ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.