హైటెక్​సిటీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి డ్రగ్స్​ దందా
1 min read

హైటెక్​సిటీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి డ్రగ్స్​ దందా

అతనో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. ఉద్యోగం చేస్తుండగా వచ్చే జీతం సరిపోకపోవడమో లేదా సులభంగా డబ్బు సంపాధించాలనే కారణంతోనో డ్రగ్స్​ విక్రయించాలని డిసైడ్​ అయ్యాడు. బెంగుళూరు నుండి డ్రగ్స్​ తీసుకువచ్చి ఐటీ కారిడార్​లో ఐటీ ఉద్యోగులకు అమ్మేందుకు సిద్ధమవుతుండగా పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

అతని వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముత్యాల సాయికిరణ్(28) ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చి ఓ ఐటి సంస్థలో టెక్నికల్ సపోర్టుగా పనిచేస్తున్నాడు.

గౌలిదొడ్డి కేశవనగర్ లోని నెస్ట్ ఇన్ హోమ్స్ అపార్టుమెంట్​లో నివాసం ఉంటున్నాడు. కాగా తనకు పరిచయం అయిన రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి నిషేదిత ఎండీఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. కేశవనగర్ లోని తన నివాసంలో డ్రగ్స్ ఉంచి విక్రయించేందుకు ప్రయత్నించాడు. కాగా ఈ విషయమై సమాచారం అందుకున్న మాదాపూర్​ ఎస్​ఓటీ, గచ్చిబౌలి పోలీసులు సాయికిరణ్ నివాసం మీద సోమవారం రాత్రి దాడి చేశారు.

ఇంట్లో నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకొని సాయికిరణ్​ను అరెస్టు చేశారు. ఇతనితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన నిజాంపేటకు చెందిన కౌశిక్(26), షాబాద్​కు చెందిన ఏ. రాఘవేంద్రరెడ్డి (30)ల మీద సైతం కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఈమేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు