శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఇంచార్జ్ రేసులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్.. కేటీఆర్ను కలిసింది అందుకేనా..
హైదరాబాద్ నగరంలో అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీకి గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేసులో సాయిబాబా ఉన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి నందినగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాల గురించి కేటీఆర్తో చర్చించారు. కేటీఆర్ను కలిసిన వారిలో బోయిన్పల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
