తెలంగాణ రాజ్భవన్కు కొత్త పేరు
రాజ్భవన్ ఇక నుండి లోక్భవన్
తెలంగాణ వార్త మ్యాన్ : తెలంగాణ రాష్ర్ట గవర్నర్ అధికార నివాసం రాజ్భవన్ పేరు మారింది. కొత్త పేరును ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాజ్భవన్ పేరును లోక్భవన్గా మారుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రాజ్భవన్లను లోక్భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు రాజ్భవన్, రాజ్ నివాస్ల పేర్లను లోక్భవన్, లోక్నివాస్లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోమంత్రిత్వ శాఖ లేఖలు రాయగా, దానికి అనుగుణంగా రాష్ర్టాల్లో పేర్లు మార్చుతూ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాజ్భవన్లను లోక్భవన్లుగా మార్చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం కూడా రాజ్భవన్ పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
