Andhra Pradesh
cinema
Gallery
National
శిల్పారామంలో న్యూ ఇయర్ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు
మాదాపూర్ శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా నగరం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో కిటకిటలాడుతన్నాయి. చేనేత ఉత్తత్తుల స్టాల్స్ మొత్తం కిక్కిరిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కథక్, కూచిపూడి, ఒడిసా, భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి. శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం, బోటింగ్, ప్లే ఏరియా సందర్శకులతో నిండిపోయింది. కొందరూ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పచ్చికబయళ్లలో వనభోజనాలు చేశారు. […]
మూడు నెలల క్రితమే లవ్ మ్యారేజ్.. నూతన సంవత్సరం రోజే సూసైడ్ చేసుకున్న భర్త
నూతన సంవత్సరం రోజున ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ జంట ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మూడు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న యువతి, యువకుడు.. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశం కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు. న్యూయర్ వేళ తనతో టైమ్ స్పెండ్ చేస్తాడనుకుంటే.. ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్తో కలిసి అర్దరాత్రి వరకు మద్యం తాగి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే కోపంతో ఉన్న భార్య.. […]
దుర్గం చెరువులో 5 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డ ఆంధ్ర (సినీ) ప్రజాప్రతినిధి
స్థలం నాదేనంటూ దర్జాకు పార్కింగ్ దందా.. ప్రతి నెల 50 లక్షల అద్దె వసూళు.. దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా చెక్ -5 ఎకరాల మేర కబ్జాలను తొలగించిన హైడ్రా ఎత్తైన కొండల మధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువు అప్పుడు ఎన్నీ ఎకరాలు విస్తరించి ఉంది.. ప్రస్తుతం ఎన్నీ ఎకరాలు ఉందో తెలుసా. ఒకప్పుడు నిజాం రాజులకు తాగునీటిని అందించిన దుర్గం చెరవు ప్రస్తుతం మురుగునీటితో కంపుకొడుతుంది. రెండు ప్రాంతాలను కలుపుతూ […]
చైనా మాంజాతో పతంగి ఎగరవేస్తున్నారా ? ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త
సరదా కోసం ఎగరవేసే పతంగుల మాంజాతో ప్రమాదం.. మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజాలు.. విచ్చిలవిడిగా చైనా మాంజాలు విక్రయం.. తూతూమంత్రంగా పోలీసుల తనిఖీలు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో నగర వీధుల్లో చైనా మాంజా మృత్యువు రూపంలో దూసుకువస్తుంది. నిషేదం ఉన్నా కూడా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మాంజాతో నగర ప్రజలు పతంగులు ఎగరవేస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు సిటీ రోడ్లపై ప్రయాణించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. […]
కబ్జాదారుల నుండి రూ. 13 కోట్ల పార్కు స్థలం కాపాడిన హైడ్రా
కబ్జాదారుల చెరులో ఉన్న 13 కోట్ల విలువైన 1000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. పార్కు స్థలం చుట్టూ వేసిన ప్రీకాస్ట్ వాల్ను కూలగొట్టి కబ్జా చెరు నుండి విముక్తి చేశారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో సర్వే నెంబర్ 23లో హుడా అనుమతితో ఉషోదయ ఎన్క్లేవ్ పేరిట కాలనీ ఏర్పాటు అయ్యింది. ఇందులో 1000 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి ఈ మేరకు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. పార్కు […]
వలస కూలీలు, బిక్షాటకులకు దుప్పట్లు పంపిణీ..
బతుకుదెరువు కోసం వలస వచ్చి రోడ్ల వెంట, ఫ్లైఓవర్ల కింద చలికి వణుకు జీవనం వెల్లదీస్తున్న వారికి సందయ్య మెమోరియల్ ట్రస్ట్ బాసటగా నిలిచింది. నల్లగండ్ల పరిసర ప్రాంతాల్లో చలికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు, బిక్షాటకులకు ఆదివారం శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే, సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ దుప్పట్లు పంపిణీ చేశారు. కనీస అవసరాలు తీర్చకోలేని దుస్థితిలో ఉన్నట్లువంటి పేద ప్రజలకు తన వంతుగా సహాయం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి […]
సందర్శకులతో కళకళలాడుతున్న శిల్పారామం
శిల్పారామం సందర్శకులతో కళకళలాడుతుంది. వారంతం కావడం, దీనికి తోడు అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున సందర్శకులు శిల్పారామంకు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నవి. కోట , ఝామదని , తస్సార్, దాఖ, బనారసీ, కార్పెట్స్, జ్యూట్ బ్యాగ్స్, జ్యూట్ బొమ్మలు, , అలంకరణ వస్తువులు, గృహాఅలంకరణ వస్తువులు, బాంబు బుట్టలు, కుర్చీలు, బ్లూ పాఠరీ, టెర్రకోట ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్, జ్యువలరీ, మరి ఎన్నో […]
శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి మర్చిండు..
శేరిలింగంపల్లి లో వెక్కిరిస్తున్న శిలాఫకాలు.. పాత వాటి స్థనాల్లో కొత్త శిలాఫలకాలే.. తప్ప ఒక ఇటుక పేర్చలే బీఆర్ఎస్ లీడర్, చందానగర్ మాజి కార్పొరేటర్ నవతా రెడ్డి.. త్వరలోనే జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అభివృద్ధి పనుల పేరిట కొత్త శిలఫలకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభివృద్ధి పనుల పేరిట వేసిన శిలఫలకాలు వేసి వదిలేసి ఒక్క పనికూడా చేయని ప్రజాప్రతినిధులు ప్రస్తుతం […]
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన ప్రెసిడెంట్గా సురేష్బాబు ఎన్నిక
తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి. సురేష్బాబు నూతన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రో గ్రెసివ్ ప్యానెల్ పేరుతో సినీ ఇండస్ర్టీలోని పెద్ద నిర్మాతలు, మన ప్యానల్ పేరుతో చిన్న నిర్మాతలు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో డి. సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యులు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 31 మంది, మన […]
మియాపూర్ కల్వరీ టెంపుల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే చర్చిలు మొత్తం భక్తుల ప్రార్థనలతో సందడిగా మారాయి. మియాపూర్ లోని కల్వరి టెంపుల్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదిన సందర్భంలో కల్వరి టెంపుల్ లో గురువారం ఉదయం 6 గంటల నుండే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కల్వరీ టెంపుల్ కి భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కల్వరి టెంపుల్ ప్రత్యేక ఏర్పాట్లు […]

