తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ !
తెలంగాణ రాష్ర్ట నూతన డీజీపీగా సీనియర్ ఐపిఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న శివధర్రెడ్డి పదవి విరమణ కాలం ఈ నెల 30తో ముగుస్తుండడంతో రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ర్టంలో పలువురు ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ బదిలీల్లో హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్ స్థానంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీ రేసులో సీవీ ఆనంద్, శిఖాగోయల్తో పాటు ఇతర అధికారులు పోటీ పడుతుండగా… ప్రభుత్వం సీవీ ఆనంద్ వైపు మెగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ను ప్రకటిస్తూ ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయబోతుందని తాజా ఐపీఎస్ అధికారుల బదిలీల ఉత్తర్వులతో ఉహాగానాలు మొదలయ్యాయి.
