హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో దొంగలు పడిండ్రు..
1 min read

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో దొంగలు పడిండ్రు..

 

హెచ్​సీయూలో ఇంటి దొంగలు..

కిటికి గ్రిల్స్​ తొలగించి 50 ల్యాప్​ట్యాప్​లు ఎత్తుకెళ్లిన దొంగలు..

గచ్చిబౌలిలోని హైదరాబాద్​ సెంటర్​ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు.  సెక్యూరిటీ అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు ప్రవేశం లేనటువంటి పటిష్ట బందోబస్తు ఉండే హెచ్​సీయూలో దొంగతనం జరగడం వర్సిటీలో సంచలనంగా మారింది.  వర్సిటీ సీఆర్​రావు ఇనిస్టిట్యూట్​లో కిటికి గ్రిల్స్​ తొలగించి 50 ల్యాప్​టాప్​లు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

 

హెచ్​సీయూలో సీఆర్​రావు ఇనిస్టిట్యూట్​ క్లాస్​రూంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కిటికి గ్రిల్స్​ తొలగించి లోపలికి ప్రవేశించి క్లాస్​రూంలో ఉన్న ల్యాప్​టాప్​లను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం క్లాస్​రూంలో ల్యాప్​టాప్​లు కనిపించకపోవడంతో వర్సిటీ మేనేజ్​మెంట్​ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు క్లాస్​రూం కిటికి గ్రిల్స్​ తొలగించి ఉండడం, కారు టైర్ల గుర్తులు ఉన్నట్లు గుర్తించారు.

 

దీంతో పోలీసులు వర్సిటీలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సీఆర్​రావు ఇనిస్టిట్యూట్​లోనే పెద్ద ఎత్తున ల్యాప్​టాప్​లు ఉన్న విషయం వర్సిటీలో తెలిపిన వ్యక్తులకే సమాచారం ఉంటుందని, ఇది ఇంటి దొంగలే పనే అయ్యుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చోరికి గురైన 50 ల్యాప్​టాప్​లు శుక్రవారమే తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇంతలోనే చోరీ గురవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.