తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన ప్రెసిడెంట్గా సురేష్బాబు ఎన్నిక
తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి. సురేష్బాబు నూతన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రో గ్రెసివ్ ప్యానెల్ పేరుతో సినీ ఇండస్ర్టీలోని పెద్ద నిర్మాతలు, మన ప్యానల్ పేరుతో చిన్న నిర్మాతలు పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో డి. సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యులు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 31 మంది, మన ప్యానెల్ నుండి 17 మంది గెలుపొందారు.
ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్కుమార్, కోశాధికారిగా రామదాసులు గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగుతంది.
