దేశంలో మొట్టమొదటి నేచర్ థీట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్.. ఎక్కడో తెలుసా ?
ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతిబింభించేలా అస్సాంలోని గుహహటిలో లోక ప్రియ గోపినాథ్ బొర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన నూతన టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు.

దేశంలో మొదటిసారిగా ప్రకృతి థీమ్లో ఈ టెర్మినల్ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ టెర్మినల్ను దాదాపు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం 5వేల కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ టెర్మినల్లో 14 ఎంట్రీ పాయింట్లతో అత్యాధునిక పరికరాలతో రూపొందించారు.

అందుబాటులోకి వచ్చిన ఈ టెర్మినల్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, పర్యాటకానికి కీలకంగా మారుతుంది. ఇది అస్సాం మౌలిక సదుపాయాలకు ఒక పెద్ద ప్రోత్సాహమని, సామర్థ్యం పెరగడం వల్ల జీవన సౌలభ్యం మెరుగుపడుతుండడంతో పాటు వాణిజ్యంతో పాటు పర్యాటక రంగానికి కూడా ఊతం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.

