ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..
1 min read

ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..

పరీక్షలు ఎప్పడి నుండి అంటే..?

 

పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ఎస్​ఎస్​సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్2), ఏప్రిల్ 1న సెకెండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్టు అధికారులు ప్రకటన విడుదల చేశారు. పదోతరగతి పరీక్షల తేదిలు విడుదలైన సందర్భంగా విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు.