శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​..
1 min read

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​..

నవంబర్ 18న ఫిబ్రవరి నెల స్వామి దర్శన కోటా విడుదల

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరికబురు అందింది. శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ వెల్లడించనుంది. నవంబర్​ 18వ తేదిన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. నవంబర్​ 21వ తేదిన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. 24న తేదిన ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల అవుతాయి. 24న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్​ దర్శన కోటా విడుదల చేస్తారు. 24వ తేదిన మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.

25న 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.
————————————-