మూడు సైబర్ క్రైమ్ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్ నేరస్థులు అరెస్ట్..
26 కేసుల్లో 42 రిఫండ్ అర్డర్స్ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్.. ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్ క్రైమ్ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్ క్రిమినల్స్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్ ఫ్రాడ్, మోసపూరిత ఫ్రాడ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్ ఆర్డర్స్ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్ చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ […]
నవంబర్ 11న ‘చలో సచివాలయం’ ర్యాలీకి ప్రైవేట్ కాలేజీల పిలుపు!
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ 11న ‘చలో సచివాలయం’ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) పిలుపునిచ్చింది. నిరవధిక బంద్: బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ, బి.ఎడ్, నర్సింగ్ తదితర కళాశాలలు ఇప్పటికే […]
నవంబరు 5న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు […]
