హెచ్సీయూ అడవి నుండి బయటకొచ్చిన జింక.. కారు ఢీకొట్టడంతో మృతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో నుండి ఓ జింక దారి తప్పి గచ్చిబౌలి లింగంపల్లి పాత జాతీయ రహదారిపైకి వచ్చింది. ఇదే సమయంలో అటూగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ జింక చికిత్స పొందుతూ మృతి చెందింది.
శనివారం ఉదయం హెచ్సీయూ అటవీ ప్రాంతం నుండి జింక తప్పిపోయి గచ్చిబౌలి లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిలోని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అఫీస్ సమీపంలో అలిండ్ కంపెనీ ప్రహారీ గోడ వద్ద తిరుగుతూ కనిపించింది. దీంతో స్థానికులు, రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
జింక ఒక్కసారిగా రోడ్డుపైకి చేరడంతో అటూగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింకకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హెచ్సీయూ యామిన్ ప్రొటెక్షన్ టీంకు, సిటిజన్స్ ఫర్ యానిమల్స్ ఎన్జీఓకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్జీఓ సభ్యులు స్థానికుల సహాయంతో జింకను వన్యప్రాణి అంబులెన్స్లో సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జింక మృతి చెందింది.
