Telangana
చైనా మాంజాతో పతంగి ఎగరవేస్తున్నారా ? ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త
సరదా కోసం ఎగరవేసే పతంగుల మాంజాతో ప్రమాదం.. మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజాలు.. విచ్చిలవిడిగా చైనా మాంజాలు విక్రయం.. తూతూమంత్రంగా పోలీసుల తనిఖీలు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో నగర వీధుల్లో చైనా మాంజా మృత్యువు రూపంలో దూసుకువస్తుంది. నిషేదం ఉన్నా కూడా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మాంజాతో నగర ప్రజలు పతంగులు ఎగరవేస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు సిటీ రోడ్లపై ప్రయాణించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. […]
కబ్జాదారుల నుండి రూ. 13 కోట్ల పార్కు స్థలం కాపాడిన హైడ్రా
కబ్జాదారుల చెరులో ఉన్న 13 కోట్ల విలువైన 1000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. పార్కు స్థలం చుట్టూ వేసిన ప్రీకాస్ట్ వాల్ను కూలగొట్టి కబ్జా చెరు నుండి విముక్తి చేశారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో సర్వే నెంబర్ 23లో హుడా అనుమతితో ఉషోదయ ఎన్క్లేవ్ పేరిట కాలనీ ఏర్పాటు అయ్యింది. ఇందులో 1000 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి ఈ మేరకు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. పార్కు […]
వలస కూలీలు, బిక్షాటకులకు దుప్పట్లు పంపిణీ..
బతుకుదెరువు కోసం వలస వచ్చి రోడ్ల వెంట, ఫ్లైఓవర్ల కింద చలికి వణుకు జీవనం వెల్లదీస్తున్న వారికి సందయ్య మెమోరియల్ ట్రస్ట్ బాసటగా నిలిచింది. నల్లగండ్ల పరిసర ప్రాంతాల్లో చలికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు, బిక్షాటకులకు ఆదివారం శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే, సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ దుప్పట్లు పంపిణీ చేశారు. కనీస అవసరాలు తీర్చకోలేని దుస్థితిలో ఉన్నట్లువంటి పేద ప్రజలకు తన వంతుగా సహాయం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి […]
సందర్శకులతో కళకళలాడుతున్న శిల్పారామం
శిల్పారామం సందర్శకులతో కళకళలాడుతుంది. వారంతం కావడం, దీనికి తోడు అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున సందర్శకులు శిల్పారామంకు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నవి. కోట , ఝామదని , తస్సార్, దాఖ, బనారసీ, కార్పెట్స్, జ్యూట్ బ్యాగ్స్, జ్యూట్ బొమ్మలు, , అలంకరణ వస్తువులు, గృహాఅలంకరణ వస్తువులు, బాంబు బుట్టలు, కుర్చీలు, బ్లూ పాఠరీ, టెర్రకోట ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్, జ్యువలరీ, మరి ఎన్నో […]
శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి మర్చిండు..
శేరిలింగంపల్లి లో వెక్కిరిస్తున్న శిలాఫకాలు.. పాత వాటి స్థనాల్లో కొత్త శిలాఫలకాలే.. తప్ప ఒక ఇటుక పేర్చలే బీఆర్ఎస్ లీడర్, చందానగర్ మాజి కార్పొరేటర్ నవతా రెడ్డి.. త్వరలోనే జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అభివృద్ధి పనుల పేరిట కొత్త శిలఫలకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభివృద్ధి పనుల పేరిట వేసిన శిలఫలకాలు వేసి వదిలేసి ఒక్క పనికూడా చేయని ప్రజాప్రతినిధులు ప్రస్తుతం […]
మియాపూర్ కల్వరీ టెంపుల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే చర్చిలు మొత్తం భక్తుల ప్రార్థనలతో సందడిగా మారాయి. మియాపూర్ లోని కల్వరి టెంపుల్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదిన సందర్భంలో కల్వరి టెంపుల్ లో గురువారం ఉదయం 6 గంటల నుండే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కల్వరీ టెంపుల్ కి భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కల్వరి టెంపుల్ ప్రత్యేక ఏర్పాట్లు […]
హైటెక్సిటీలో గంజాయి సాగు… అమ్మేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు చిక్కిండు
ఇన్నీ రోజులు ఐటీ కారిడార్లో డ్రగ్స్, గంజాయి క్రయ, విక్రయాలు, గంజాయి సేవించడం మాత్రమే జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఐటీ కారిడార్లో గంజాయి సాగు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆంధ్ర, ఒడిశా, మహరాష్ర్ట ప్రాంతాల నుండి హైదరాబాద్, ఐటీ కారిడార్కు గంజాయి ట్రాన్స్పోర్ట్ అయ్యేది. బయటి నుండి గంజాయి తెచ్చి అమ్మకం ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి.. ఏకంగా త ఇంట్లోనే గంజాయి మొక్కను సాగు చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద గంజాయి […]
అన్నమయ్య పదార్చన.. తందనాన స్వరార్చన
ఘనంగా అంతర్జాతీయ సంగీత పోటీల గ్రాండ్ ఫైనల్స్ పదకవితా పితామహుడి సంకీర్తనలు నేటి తరం గళంలో నవ రాగాలై ప్రతిధ్వనించాయి. భక్తి భావం పరిమళించిన వేదికపై ‘తందనాన – అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలు 2025’ గ్రాండ్ ఫైనల్స్ అంగరంగ వైభవంగా సాగాయి. హైటెక్స్ సమీపంలోని అన్నమాచార్య భావన వాహిని (ఏబీవీ) ప్రాంగణం ఒక దివ్య క్షేత్రాన్ని తలపించింది. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ఆశయం ప్రతి స్వరంలోనూ ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ […]
బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా
నీటితో కలకలలాడుతున్ననిజాం కాలం నాటి చెరువు నూతన సంవత్సరంలో చెరువు పున: ప్రారంభం అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు మంచినీరు అందించిన చెరువు కాలక్రమేనా మురికికూపంగా మారిపోయాయి. దీనికి తోడు భూమి ధరకు రెక్కలు రావడంతో కబ్జాదారులు చెరువు స్థలాలను చెరబట్టారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా అందుబాటులోకి రావడంతో చెరువులు తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. పాతబస్తీలో నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా […]
శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభం
జనవరి 5 వరకు అందబాటులో హస్తకళా ఉత్పత్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా మాదాపూర్లోని శిల్పారామంలో షురూ అయ్యింది. డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు అండ్ శిల్పారామం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం శనివారం ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఈ మేళాలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. […]
