1 min read

హైటెక్​సిటీలోని ఆ రూట్​లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్​ తిప్పలే..

 

హైటెక్​సిటీలో ఐదు రోజుల వాహనదారులు ట్రాఫిక్​ తిప్పలు తప్పేలా లేవు. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగడంతో రిపేర్​ చేయడానికి అలస్యం అయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఆ రోడ్డును ట్రాఫిక్​ పోలీసులు ఐదు రోజుల పాటు క్లోజ్​ చేయనున్నారు. దీంతో ఐకియా నుండి సైబర్​ టవర్స్​ మీదుగా జేఎన్​టీయూ వెళ్లే వెహికిల్స్​ మరో రూట్​లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే రూట్​లో ట్రాఫిక్​ రద్దీ ఏర్పడుతుంది. కుంగిన రోడ్డును టీజీఐఐసీ ఇంజనీరింగ్​ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ రూట్​లో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

 

ఐదు రోజుల పాటు ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే వాహనదారులు ఐకియా నుండి వచ్చే వాహనాలు లెమన్ ట్రీ హోటల్ / రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఎడమ వైపు తిరిగి టెక్ మహీంద్రా–సీఐఐ జంక్షన్ నుండి కుడి వైపు తిరిగి జేఎన్‌టీయూ వైపు వెళ్లాలి. వాహనదారులు పోలీసులకు సహకరించి, సూచించిన మార్గాలను అనుసరించి రాకపోకలు సాగించాలని పోలీసులు కోరారు.