తెలంగాణ రాజ్​భవన్​కు​ కొత్త పేరు
1 min read

తెలంగాణ రాజ్​భవన్​కు​ కొత్త పేరు

రాజ్​భవన్​ ఇక నుండి లోక్​భవన్​

తెలంగాణ వార్త మ్యాన్​ : తెలంగాణ రాష్ర్ట గవర్నర్​ అధికార నివాసం రాజ్​భవన్​ పేరు మారింది. కొత్త పేరును ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాజ్​భవన్​ పేరును లోక్​భవన్​గా మారుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రాజ్​భవన్​లను లోక్​భవన్​గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు రాజ్​భవన్​, రాజ్​ నివాస్​ల పేర్లను లోక్​భవన్​, లోక్​నివాస్​లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోమంత్రిత్వ శాఖ లేఖలు రాయగా, దానికి అనుగుణంగా రాష్ర్టాల్లో పేర్లు మార్చుతూ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్​, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా, పశ్చిమబెంగాల్​ రాజ్​భవన్​లను లోక్​భవన్​లుగా మార్చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం కూడా రాజ్​భవన్​ పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.