శేరిలింగంపల్లి సర్కిల్ ఏసీపీ వెంకటరమణపై చర్యలు తీసుకోండి
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత మిద్దెల మల్లారెడ్డి
శేరిలింగపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటరమణపై అవినీతి అరోపణలు వచ్చిన ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు. ఏసీపీ వెంకటరమణ, చైన్మెన్ మోహన్పై చర్యలు తీసుకోవాలని సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిపై ఎన్నీ సార్లు ఫిర్యాదు చేసిన శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, టీపిఎస్లు, చైన్మెన్లు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై నిలదీస్తే సీజింగ్ పేరిట వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏసీపీ వెంకట రమణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
