1 min read

శేరిలింగంపల్లి తహసీల్ధార్​ బదిలీ.. నూతన తహసీల్దార్​గా మహిపాల్​రెడ్డి

 

శేరిలింగంపల్లి తహసీల్దార్​ వెంకారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్​ కలెక్టర్​గా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతనిలో పాటు తెలంగాణ రాష్ర్టంలో పలువురు డిప్యూటీ, అడిషనల్ కలెక్టర్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి నూతన ఎమ్మార్వోగా మెదక్​ జిల్లా నర్సాపూర్​ ఆర్డీఓగా పనిచేస్తున్న మహిపాల్​రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

 

జోగులాంబా గద్వాల జిల్లా డిఆర్​ఓగా పద్మజరాణి, మహబూబ్​నగర్​ అడిషనల్​ కలెక్టర్​గా హరిప్రియ, అదిలాబాద్​ అడిషనల్​ కలెక్టర్​గా భుజంగరావు, గద్వాల ఆర్డీఓగా టి. శ్రీనివాస్​రావు,  నర్సాపూర్​ ఆర్డీఓగా పి. రామకృష్ణ, చేవెళ్ల ఆర్డీఓగా ప్రతాప్​సింహారెడ్డి, ఖమ్మం ఆర్డీఓగా శ్రీనివాస్​, మెట్​పల్లి ఆర్డీఓగా నర్సింహారావు, నల్గొండ స్పెషల్​ కలెక్టర్​గా మాధవిదేవి, ఎల్లారెడ్డి ఆర్డీఓగా ప్రభాకర్​గా నియామకం అయ్యారు. వీరితో పాటు పలువురు స్పెషల్​ కలెక్టర్​లను కూడా బదిలీ చేసింది.