చందానగర్​ సర్కిల్లో కలెక్షన్​ ఏజెంట్​గా మారిన కంప్యూటర్​ ఆపరేటర్​ ?
1 min read

చందానగర్​ సర్కిల్లో కలెక్షన్​ ఏజెంట్​గా మారిన కంప్యూటర్​ ఆపరేటర్​ ?

  • ఏసీపీ, టిపిఎస్​ల వెంట ఫీల్డ్​కు
  • ఫిర్యాదులో పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం..
  • చందానగర్ సర్కిల్​లో గడ్డం గ్యాంగ్​ అరాచకాలు..
  • చందానగర్​ టౌన్​ ప్లానింగ్​ అవినీతిపై ప్రత్యేక కథనం.

 

ఓ ఉద్యోగి అయినా తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తాడు. తనకు రానీ పనిని చేయాలనుకోడు. కానీ జీహెచ్​ఎంసీ చందానగర్​ సర్కిల్​లోని టౌన్​ ప్లానింగ్ విభాగంలో ఓ ఔట్​ సోర్సింగ్ ఉద్యోగి తన రూటే సపరేట్ అంటున్నాడు. తనకు కేటాయించిన పనిని కాదని మరో పని చేస్తున్నాడు. టౌన్​ ప్లానింగ్​ విభాగంలో కంప్యూటర్​ అపరేటర్​గా పనిచేయాల్సిన ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగి కలెక్షన్​ ఏజెంట్​గా మారాడు.

 

అఫీస్​లో కంప్యూటర్​ ముందు కుర్చోవల్సిన సదరు ఉద్యోగి అఫీస్​లో కంటే ఫీల్డ్​ వర్క్​ వైపే మొగ్గు చూపుతున్నాడు. చందానగర్​ ఏసీపీ, టిపిఎస్​ల వెంట ఫీల్డ్​కు వెళ్తున్నాడు. ఏసీపీ కూడా ఈ కంప్యూటర్​ అపరేటర్​ను తన వసూళ్ల దందా కోసం ఉపయోగించుకుంటున్నాడు. టౌన్​ ప్లానింగ్​లో ఏదైన కంప్లైంట్​లు వస్తే వాటిని తన ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నాడు.

 

ఏసీపీ, టిపిఎస్​లు కంప్లైంట్​ వచ్చింది ఏంటో చూడు అని.. చెప్పడమే లేట్​.. వెంటనే సదరు నిర్మాణం వద్ద వాలిపోయి.. మీ బిల్డింగ్​ మీద కంప్లైంట్​ వచ్చాయి.. అంటూ నిర్మాణదారులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా వసూళ్లు చేస్తాడు. వచ్చిన వాటిలో ఏసీపీ, టిపిఎస్​లకు వాటాలు ఇచ్చి.. మిగిలినవి తన జేబులో నింపుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగి ఆగడాలపై సర్కిల్ కార్యాలయంలో జోరుగా చర్చ జరుగుతుంది.

 

కలెక్షన్​ ఏజెంట్​గా మారిన కంప్యూటర్​ అపరేటర్​..

మియాపూర్​లో ఓ అక్రమ నిర్మాణం వద్ద కంప్యూటర్​ అపరేటర్​ ప్రవీణ్​కుమార్​ అలియాస్​ గడ్డం శ్రీను

 

శేరిలింగంపల్లి జోన్​ చందానగర్​ సర్కిల్​ కార్యాలయంలో ఔట్​ సోర్సింగ్​ విధానంలో ప్రవీణ్​కుమార్​ టౌన్​ ప్లానింగ్​ విభాగంలో కంప్యూటర్​ అపరేటర్​గా పనిచేస్తున్నాడు. ఇతను అఫీస్​లో ఉంటూ అధికారుల వద్ద కంప్యూటర్​ అపరేటర్​గా పనిచేయాలి. కానీ ఇతను ఏనాడు కంప్యూటర్​ పట్టుకున్న దాఖలాలు లేవు.

 

సర్కిల్​ ఏసీపీ నాగిరెడ్డి, టిపిఎస్​లు రమేష్​, రోహన్​ ఠాకూర్​ వెంట సర్కిల్​లో వివిధ డివిజన్​లలో పర్యటిస్తున్నాడు. టిపిఎస్​లు కొత్తవారని వారికి డివిజన్​లు సరిగ్గా తెలియవనే సాకుతో వారిని వెంట పెట్టుకొని డివిజన్​లలోని అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడం, భవన నిర్మాణ సామాగ్రి తీసుకురావడం వంటి పనులు చేస్తున్నాడు.

 

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే ఏసీపీ నాగిరెడ్డి వెంటనే కంప్యూటర్​ అపరేటర్​ ప్రవీణ్​కుమార్​ను రంగంలోకి దించుతారు. వెంటనే ప్రవీణ్​కుమార్​ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకొని ఫిర్యాదులు వచ్చాయంటూ భారీగా వసూళ్లు చేసి, వచ్చిన వాటిల్లో వాటలు వేసి అందరికి పంచిపెడుతున్నాడు. చందానగర్​ ఏసీపీకి కంప్యూటర్​ అపరేటర్ ప్రవీణ్​కుమార్​ అలియాస్​ గడ్డం శ్రీను​ కలెక్షన్​ ఏజెంట్​గా మారి అన్నీ తానై చక్కబెడుతున్నాడని తోటి ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.

 

ఏసిపి, టిపిఎస్​ల వెంట ఫీల్డ్​కు

 

కంప్యూటర్​ అపరేటర్​ అఫీస్​లో ఉండి అధికారులు చెప్పిన ఫైల్స్​ను అప్లోడ్​ చేయడం, డాక్యుమెంట్లు ఇవ్వడం, భవన నిర్మాణ అనుమతులు వంటి వాటిపై ప్రవీణ్​కుమార్ పనిచేయాల్సి ఉంది.​ కానీ అతను ఏరోజు ఈ విధులు నిర్వహించడు. డీసీ, ఏసీపీ, టిపిఎస్​లను మచ్ఛిక చేసుకొని అఫీస్​లో కంటే ఫీల్డ్ వర్క్​కు వెళ్లడానికే మొగ్గుచూపుతున్నాడు.

 

దీనికి ఒక కారణమే ఉంది. ఫీల్డ్​లో తిరిగితే కంప్యూటర్​ అపరేటర్​గా పనిచేస్తే వచ్చే జీతం రూ.19,820 కంటే పదింతల రెట్టింపు ఆదాయం వస్తుందని నిత్యం అధికారుల వెంట ఫీల్డ్​కు వెళ్తున్నాడు. ఏసీపీ, టిపిఎస్​లు కూడా చైన్​మెన్​లు కొత్తవారు కదా ? అనే సాకుతో కంప్యూటర్​ అపరేటర్ ప్రవీణ్​కుమార్​​ను ఫీల్డ్​కు తీసుకొని వెళ్తూ అక్రమ నిర్మాణాల వద్ద తమ పనులను కూడా చక్కబెట్టుకుంటున్నారు.

 

ఫిర్యాదుల పేరుతో వసూళ్ల దందా

 

చందానగర్​ సర్కిల్​లో ప్రజల నుండి అత్యధిక ఫిర్యాదులు వచ్చేవి టౌన్​ ప్లానింగ్​ విభాగాకే. ఈ ఫిర్యాదులే టౌన్​ ప్లానింగ్​ అధికారులు, సిబ్బందికి ఆదాయం సమకూర్చే వనరులుగా మారాయి. సర్కిల్​లో మాదాపూర్​, హఫీజ్​పేట్​, మియాపూర్​ డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి.

 

ఈ అక్రమ నిర్మాణాలపై టౌన్​ ప్లానింగ్​ అధికారులకు ప్రజల నుండి ఫిర్యాదు వచ్చాయంటే చాలు వెంటనే సర్కిల్​ ఏసీపీ నాగిరెడ్డి కంప్యూటర్​ అపరేటర్​ ప్రవీణ్​కుమార్​ అలియాస్​ గడ్డం శ్రీనుని రంగంలోకి దింపుతాడు. పలానా ఏరియాలో అక్రమ నిర్మాణం జరుగుతుందని ఫిర్యాదు అందింది, ఏంటో చూసి రాపో అంటూ అతన్ని పంపిస్తాడు.

 

దీంతో కంప్యూటర్​ అపరేటర్​ అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి నిర్మాణాలను ఫిర్యాదులు వచ్చాయంటూ భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద భారీగా డబ్బులు వసూళ్లు చేసి వచ్చిన డబ్బులో ఏసీపీ, టిపిఎస్​లకు వాటాలు పంచి మిగిలినవి తన జేబులో వేసుకుంటున్నాడు. సదరు కంప్యూటర్​ అపరేటర్​పై ఏన్నీ ఫిర్యాదులు వచ్చిన జోనల్​, సర్కిల్​ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని తోటి ఉద్యోగులు, ఇతర అధికారులు ఆరోపిస్తున్నారు.