శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుండి సందర్శకులు శిల్పారామంకు భారీగా తరలివచ్చారు. శిల్పారామంలోని అంపి థియేటర్లో నిర్వహించిన కళాకారులు నృత్యాలు ఆహుతులను మైమరిపించాయి. శ్రీ గీతికా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గురువర్యులు లక్ష్మి కృష్ణ శిష్య బృందం మహా గణపతిమ్, శ్రీ విజ్ఞ రాజాం భజే, శివ శంభో, తిల్లాన, శివ స్తుతి, నటరాజ తాండవం, నృత్యాంజలి తిల్లాన, ఆంగికం మహా దేవా శంకర,…