కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కి లీగల్​ నోటీసులు.. ఎవరు పంపారంటే ?
1 min read

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కి లీగల్​ నోటీసులు.. ఎవరు పంపారంటే ?

 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించారని​ బీఆర్​ఎస్​ ముఖ్య నాయకుడు లీగల్​ నోటీసులు పంపించారు. బండి సంజయ్​తో పాటు నిజామాబాద్​ ఎంపి ధర్మపురి అరవింద్​కు కూడా లీగల్​ నోటీసులు పంపించారు. తనపై,  తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని  మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ పార్టీ ​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ బండి సంజయ్​, ఎంపి అర్వింద్​కు వేరువేరుగా​ లీగల్​ నోటీసులు పంపించారు.

తన రాజకీయ ప్రతిష్టతను దెబ్బతిసే విధంగా, ప్రజల్లో తనకు ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చేసేలా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేటీఆర్​ నోటీసుల్లో పేర్కొన్నారు. పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన ఇద్దరు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.  బండి సంజయ్​, ఎంపి అర్వింద్​లకు తన లాయర్ల ద్వారా కేటీఆర్​ నోటీసులు పంపించారు. ఇప్పటికే బండి సంజయ్​పై సిటీ సివిల్​ కోర్టులో పరువు నష్టం దావా కేసు నడుస్తున్నప్పటికీ, మరోసారి అదే తరహాలో వ్యాఖ్యాలు చేయడం వివాదాస్పదమైంది.