చందానగర్​ పోలీస్​ స్టేషన్​ను అకస్మిత తనిఖీ చేసిన శేరిలింగంపల్లి డీసీపీ
1 min read

చందానగర్​ పోలీస్​ స్టేషన్​ను అకస్మిత తనిఖీ చేసిన శేరిలింగంపల్లి డీసీపీ

చందానగర్​ పోలీస్​ స్టేషన్​ను శేరిలింగంపల్లి జోన్​ డీసీపీ శ్రీనివాస్ అకస్మిక తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం పోలీస్​ స్టేషన్​కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్​ స్టేషన్​ పరిసరాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం కేసుల వివరాలను తెలుసుకొని రికార్డులను పరిశీలించారు.

ఫిర్యాదుల ఆన్​లైన్​ నమోదును అడిగి తెలుసుకుంటున్న డీసీపీ శ్రీనివాస్​

రికార్డులను నిర్వహిస్తున్న తీరుపై డీసీపీ ఇన్​స్పెక్టర్​, అడ్మిన్​ ఎస్​ఐపై అగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.  ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారి పట్ల గౌరవంగా మాట్లాడుతూ భరోసా కల్పించాలని డీసీపీ సిబ్బందికి తెలియజేశారు. డీసీపీ వెంట ఏసీపీ శ్రీనివాస్​కుమార్​, చందానగర్​ ఇన్​స్పెక్టర్​ విజయ్​, డీఐ భాస్కర్​లు ఉన్నారు